జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రేక్షక అభిమానులు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నేపథ్యం ఏంటి అని అడుగుతున్నారు. అయితే ఆ మధ్య ఈ సినిమా పాలిటిక్స్  యువత బలహీనత బలం అంటూ ఏవో కొన్ని పాయింట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఆ పాయింట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఏ నేపథ్యంలో రానుంది అన్న చర్చలు జరుగుతున్నాయి. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఏకంగా కొద్ద దివి సెట్ కూడా సిద్ధం చేసే పనిలో చిత్ర బృందం. అంతేకాదు సముద్రం పెద్దపెద్ద పడవలు ఇలా చాలానే ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఈ వార్త విన్న చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ కూడా మెగా ఫ్యామిలీ లాగే సముద్రం నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నారా అని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి హిట్లు కలిసి వచ్చిన అంశాలు ఏవి అని అడుగుతే అందులో సముద్రం మహాసముద్రం కనిపిస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి రంగస్థలం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడ ఆ సినిమాలో రామ్ చరణ్ గంగపుత్రుడు లాగా కనిపిస్తాడు.

దాని అనంతరం వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా ఎక్కువ శాతం సముద్రం నేపథ్యంలోనే ఉంటుంది. ఈ మధ్య వచ్చిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా సముద్రం నేపథ్యంలోనే ఉంటుంది. ఈ విధంగా చూస్తే మెగా హీరోలకు సముద్రం నేపథ్యం బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే సముద్రం నేపథ్యంలో సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం.గతంలో ఈ సినిమా విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో ఉంటుందని రకరకాల వార్తలు వినిపించాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా ఒక ప్రాంత నాయకుడు నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఈ కథలో మార్పులు చేశారా లేక మొదటినుండి ఈ సినిమాని ఈ విధంగానే తెరకెక్కించాలని అనుకున్నారా అన్న విషయం మాత్రం ఇంకా తెలియదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: