సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీ తోడు కావాలి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి క్రేజ్ ని కూడా సంపాదించుకుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ని ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది ఈమె.తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళం భాషల్లో కూడా నటించింది. అనుకోని విధంగా ఆఫర్లు తగ్గుతున్న సమయంలో జ్యోతిలక్ష్మి అనే ఒక సినిమాతో నిర్మాతగా మారింది చార్మి .ఛార్మి ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినప్పటికీ ఛార్మికి మాత్రం పెద్దగా కలిసి రాలేదు. 

సినిమా తర్వాత నుండి చార్మి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టింది.అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని కూడా ఫ్లోప్ లు గా నిలిచాయి. ఇక అలా వీరిద్దరూ కెరియర్ ముగిసింది అన్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ అనే ఒక సినిమాతో చార్మి మరియు పూరి జగన్నాథ్ మళ్లీ ఇదివరకులా ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో లైగర్ అనే ఒక సినిమాను రూపొందించారు వీరిద్దరూ. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రావడం జరిగింది.ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైనప్పటికీ భారీ డిజాస్టర్ గా మిగిలింది.

 భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా దెబ్బతీసింది. ఇక ఈ సినిమా దెబ్బకి చార్మి మరియు పూరి జగన్నాథ్ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తర్వాత చార్మి పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని తెలుస్తోంది. అంతేకాదు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చార్మి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు లైజర్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఛార్మికి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడిందట. చేతిలో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితిని ఆమె ఎదుర్కొంటున్నట్టు తన కష్టాన్ని చెప్పుకుంటూ గతంలో చార్మి ఏడ్చిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం మరోసారి ఛార్మికి ఇదే పరిస్థితి ఎదురైనట్లుగా తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: