తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్ ఎన్నో వివాదాలకు దారి తీస్తుంది. వరుసగా టాలీవుడ్ ప్రముఖులు గట్టు.. ఇన్డైరెక్ట్గా బయటపెడుతూ... సోషల్ మీడియాలో ట్రాల్ అవుతున్న శ్రీరెడ్డి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్లో జరుగుతున్న చీకటి భాగోతాల గురించి తాను చేసిన విమర్శలన్నింటికీ.. తనవద్ద ఆధారాలు ఉన్నాయిని.. ఇక తాజాగా తాను డైరెక్టర్ శేఖర్ కమ్ముల పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. నేను గతంలో నటించిన అరవింద్-2 డైరెక్టర్ పేరుకూడా శేఖర్ అని.. గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. ఇక్కడ చాలామంది బుజాలు తడుముకుంటున్నారని.. ఆయన లీగల్గా ప్రొసీడ్ అయినంత మాత్రానా, ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరని శ్రీరెడ్డి చెప్పింది.
గతంలో తాను యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ఛానల్ లో పనిచేసే ప్రముఖ వ్యక్తి నా నగ్న ఫోటో తనకు పంపించాల్సిందిగా కోరాడు..కానీ సిగ్గుతో నేను బ్రా మీద ఫొటో దిగి పంపించాను అని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో నాకు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని..కనీసం తనకు గుర్తింపు కార్డు లేదని..ఇక సీనియర్ నటులు ఒక్కరు కూడా నాకు అండగా నిలువడం లేదని... తెలుగు అమ్మాయిలు నానా రకాలుగా కష్టపడుతుంటే నోరు మూసుకుంటున్నారని.. ఓ ఆడదాని ఆవేదన పట్టించుకోవడం ఆవేదన వ్యక్తం చేసింది.
అంతే కాదు మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్లో నాకు ఎందుకు సభ్యత్వం ఇవ్వడం లేదో అర్ధం కావడం లేదని అన్నారు శ్రీరెడ్డి. నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో కల్పించుకుని, సినీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆమె విన్నవించింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది.
'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నానని..మీరు స్పందించకుంటే..పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది.