రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు డివివి దానయ్య. సినిమాపై ఎంత నమ్మకం ఉంటె అంత ఖర్చు చేస్తారు చెప్పండి. 1800 కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో ఉండటంతో షూటింగ్ కు కాస్త విరామం దొరికింది.
ఈ విరామంలో చరణ్ తన తండ్రి సినిమా సైరా బిజీ లో ఉండిపోయాడు. సైరా ఆడియో, ట్రైలర్ ను ఆగష్టు 22 న ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో తనకు లీవ్ ఇవ్వాలని చరణ్ దర్శకుడు రాజమౌళికి విజ్ఞప్తి చేశారు. సినిమా నిర్మాణంలో ఉండే ఇబ్బందులు ఏంటో తెలుసుకు కాబట్టి దానికి ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
చరణ్ ఆగస్టు 22 వ తేదీన మెగాస్టార్ సినిమా కోసం కష్టపడబోతున్నాడు. ఆ రోజు తండ్రి పుట్టినరోజు అదే రోజున సైరా ఆడియో, ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. పుట్టిన రోజు అంటేనే అభిమానులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటారు. దీంతో పాటు అదే రోజున ఆడియో వేడుక కూడా ఉంటుంది అంటే... పండుగే పండుగా.
అలానే, ఆడియో తరువాత సినిమాను భారీ ఎత్తున ప్రమోషన్ చేయబోతున్నారట. ఆగష్టు 2 న సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి ప్రమోషన్ కోసం దాదాపు నెలకు పైగా సమయం దొరుకుతుంది. ఆ నెల రోజుల్లో సైరాను ఎంతగా ప్రమోట్ చేసుకుంటే అంత మంచిది. సైరా థియేట్రికల్ రైట్స్ హక్కులను యూవీ క్రియేషన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.