సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు పుకార్లు మళ్లీ షికారు చేస్తున్నాయి. భరత్ అనే నేను సినిమాలో యంగ్ సీఎంగా అదరగొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? సినీ పరిశ్రమలో హీరోగా తిరుగులేని మాస్ ఫాలోయింగ్ను సాధించిన సూపర్ స్టార్ పాలిటిక్స్లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారని జాతీయ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’సినిమా షూటింగ్లో బిజీగా బిజీగా ఉండగా.. మహేష్ త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నారనే వార్తలు మీడియా సర్కిల్స్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.
అయితే ఈ ప్రచారం మహేష్ బాబుకు కొత్తదేమీ కాదు. గతంలోనూ మహేష్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఈ వార్తలపై స్పదించిన మహేష్ బాబు వాటిని ఖండించారు. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, తాను నటన తప్ప వేరే మార్గం ఏది లేదని తేల్చి చెప్పేశాడు. అదే సమయంలో ఓ ఇంటర్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ ‘చిన్నప్పటినుంచే నాకు నటన అంటే ఇష్టమని, షూటింగ్ కోసం స్కూల్ ఎగ్గోట్టేవాడిని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఒక ఏడాది వృధా కావటంతో.. నాన్నగారు(సూపర్ స్టార్ కృష్ణ) నటనకు బ్రేక్ ఇచ్చి చదువు పూర్తి చేయమన్నారని, దాంతో నేను మళ్లీ స్కూల్కి వెళ్లాల్సి వచ్చిందని ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు.
రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు సమాచారం.