ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ గా మరియు కర్నూలు కుర్రాడిగా రెండు రకాల్లో విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనపడనున్నారు. ఇక మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అలవైకుంఠపురములో సినిమా పై కూడా ప్రేక్షకులు మరియు బన్నీ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. బన్నీ ఇందులో ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నాడు. 

 

ఇకపోతే కొన్నాళ్ల క్రితం ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగా సరిగ్గా 2020 జనవరి 12నే రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ విధంగా రెండు బడా సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అవడం వలన, రెండిటికీ భారీగా ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి ఉండదని భావించి, ఇటీవల ఆ రెండు సినిమాల నిర్మాతలను కొందరు సినిమా పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి కొంత చర్చించి, చివరకు వారి మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. అయితే ఆ చర్చల తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాను జనవరి 11న, అలానే అలవైకుంఠపురములో సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. 

 

అయితే ఈ విషయమై ఇప్పటివరకు సరిలేరు సినిమా టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేనట్లు తెలుస్తోంది. ఎలాగంటే, ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ లో కానీ, లేదా టీజర్ రిలీజ్ సమయంలో కానీ రిలీజ్ డేట్ వేయలేదని, కాబట్టి రెండు సినిమాల నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చినట్లు వచ్చిన వార్తలన్నీ కూడా వొట్టివేనని అంటున్నారు. దీనిని బట్టి ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజున రిలీజ్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. కాగా నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఆ రెండు సినిమాల యూనిట్ల నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: