హీరో రాజశేఖర్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మొదటి సినిమానే ఒక వైవిధ్యత్మక   కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాత్మిక తన నటనకు గాను మంచి మార్కులు కొట్టేసింది. దొరసాని సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. అయితే ఇదే సినిమాతో అటు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్  దేవరకొండ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పరువు హత్యలు నేపథ్యంలో వచ్చిన దొరసాని సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. 

 

 

 ఈ సినిమాలో  దొరసాని గా నటించిన శివాత్మిక మొదటి సినిమాలోనే ఎంతో అనుభవం ఉన్న నటిగా పాత్రకు న్యాయం చేసింది. ఇదిలా ఉండగా దొరసాని సినిమా తర్వాత మంచి కథల కోసం వెయిట్ చేస్తుంది శివాత్మిక. ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ  సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు  సమాచారం. నటసామ్రాట్ అనే మరాఠీ మూవీ రీమేక్ గా వస్తున్న రంగ మార్తాండ సినిమాని దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్.. రమ్యకృష్ణ.. బ్రహ్మానందం.. అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

 

 

 

 కాగా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో బిగ్బాస్ తెలుగు సీజన్ 3 టైటిల్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను కూడా చిత్ర బంధం సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కు జోడిగా శివాత్మిక ను ఎంపిక చేశారట చిత్ర బంధం. శివాత్మిక రాహుల్ సిప్లిగంజ్ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తుండటం  మరో విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: