కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్ర ఖని..ఇపుడు తనలోని నటనా ప్రతిభను రోజురోజుకీ ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్లే పనిలో పడ్డాడు..గత ఏడాది  2020లో విడుదలైన అల వైకుంఠపురం చిత్రంలో పూర్తి స్థాయి విలన్ గా నటించిన సముద్ర ఖని.. ఆ సినిమాలో తన విలక్షణమైన విలనిజంతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.. ఇక ఇప్పుడు తాజగా ఈ, 2021లో మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మరో సంక్రాంతి హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు సముద్రఖని..ఇక క్రాక్ సినిమాలో కూడా కటారి క్రిష్ణ అనే పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చాడు..ఇక ఈ రెండు చిత్రాలు నటుడిగా సముద్రఖనిని మరోస్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..

ఇక ఈ దెబ్బతో సముద్ర ఖని తెలుగులో నంబర్ వన్ విలన్ గా మారిపోయాడు.. ప్రస్తుతం ఈ నటుడికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించే అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు సముద్ర ఖని..రాజమౌళి తో చాలా కాలంగా మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తున్న ఇతడికి మన జక్కన్న పిలిచి మరీ rrr లో అవకాశం ఇచ్చాడు.. ఇక తాజగా ఇపుడు మరో క్రేజీ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేశాడు ఈ తమిళ నటుడు...తాజాగా జరిగిన క్రాక్ మూవీ ప్రమోషన్స్ లో సముద్రఖని మాట్లాడుతూ..పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ లో ఓ పాత్ర చేస్తున్నానని చెప్పాడు.

సినిమాలో నా క్యారెక్టర్ గురించి అంతగా తెలియదు.త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి సినిమాలో నీకోసం ఓ మంచి పాత్ర డిజైన్ చేశానని చెప్పారని సముద్రఖని చెప్పుకొచ్చాడు..దీంతో తాను పవర్ స్టార్ సినిమాలో నటిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఈ సినిమాలో అతడు ఎలాంటి పాత్రలో నటిస్తాడోనని ఇప్పటికే చర్చించుకుంటున్నారు.. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ కి త్రివిక్రమ్ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నట్టు సమాచారం..అంతేకాదు స్వయంగా పవన్ కళ్యానే త్రివిక్రమ్ ని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేశాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: