సినిమా ఇండస్ట్రీలో హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండటం సర్వ సాధారణం. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. చాలా సార్లు వీరిద్దరి స్నేహం బయటపడింది.మోహన్ బాబు చాలా ఇంటర్వ్యూ లలో తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మోహన్ బాబు ముద్దుల కూతురు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి రజినికాంత్ తో దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసింది. ఈ పిక్ చూస్తుంటే 'అన్నాత్తే' సినిమా షూటింగ్ ముగిసిన తరువాత రజనీకాంత్ హైదరాబాద్ లోని తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు కన్పిస్తోంది.


గత కొద్దిరోజులుగా 'అన్నాత్తే' మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో 'అన్నాత్తే' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న 35 రోజుల షెడ్యూల్ నేటితో కంప్లిట్ అయ్యింది. తరువాత కోల్‌కతాలో కూడా ఒక చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో షూటింగ్ పూర్తవ్వడంతో రజనీకాంత్ ఈ రోజు తిరిగి చెన్నైకి వెళ్లిపోయారు.


ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్ దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'అన్నాత్తే'. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్  చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న డి.ఇమ్మాన్ ఈ మాస్ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇక 'అన్నాత్తే' నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: