టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. విడాకుల తర్వాత తన సినీ కెరీర్లో ఫుల్ బిజీ గా మారుతోంది ఈ హీరోయిన్. ఇక విడాకుల తర్వాత మొదటిసారి ఆమె ఒక ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. వాటి వివరాల్లోకి వెళితే.. విడాకుల అనంతరం సమంత ఫిలిం ఫేర్ తో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్, శాకుంతలం సినిమా, ఆ తర్వాత సోషల్ మీడియా ప్రభావం ఇలా అనేక విషయాలను ఆమె మీడియాతో ముచ్చటించింది. కానీ అసలు విషయం పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ది ఫ్యామిలీ మాన్ టు వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపించిందని.. 

కానీ అది అంత పెద్ద వివాదంగా మారుతుందని అసలు ఊహించలేదు. అయితే వెబ్ సిరీస్ హిట్ అయిన  తర్వాత తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని సమంత చెప్పింది. తనకు నార్త్ నుండి కూడా తనకు ప్రశంసలు దక్కడం తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొంది. ఇక కొంత కాలంగా తాను రొటీన్ సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్ కల్గిందని.. అందుకే ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పింది సమంత. ఇక శాకుంతలం సినిమా గురించి చెబుతూ.. సినిమా చేస్తున్నప్పుడు తను అస్సలు ఒత్తిడికి గురి కాలేదని.. ఎందుకంటే మొదటి నుంచి తనకు ఛాలెంజింగ్ పాత్రలు అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఈ సినిమాలో ప్రతి షాట్ ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుందని..

 ప్రతీ ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుందని.. ఇక గతంలో నేను ఎప్పుడూ చూడనంత అందంగా ఈ సినిమాలో కనిపిస్తాడని సమంత చెప్పింది. ఇక సోషల్ మీడియా గురించి కూడా చెబుతూ దాన్ని అదుపులో ఉంచడమే పేర్కొంది.సోషల్ మీడియా ద్వారా ప్లస్ మైనస్ లు కూడా ఉన్నాయి. అలవాటు ఏదైనా కావచ్చు అది మితంగా కాస్త నియంత్రణలో ఉండాలని సమంత పేర్కొంది. అందుకే తాను సోషల్ మీడియాలో తన పై వచ్చే రూమర్స్ పై స్పందించిన అని చెప్పింది. అయితే ఇన్ని చెప్పిన సమంత అసలు విషయం మాత్రం దాచింది. నాగ చైతన్య గురించి ఒక విషయం కూడా చెప్పలేదు. ముఖ్యంగా తమ విడాకులు వాటికి దారితీసిన కారణాలు మాత్రం అంతా దాచేసింది. ఇండస్ట్రీలో అందరూ విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటి అని సతమతమౌతుంటే.. సమంత మాత్రం ఆ విషయాలు చర్చించేందుకు అసలు ఇష్టపడలేదు. మరి దీనిపై సమంత ఎప్పుడు తన మౌనాన్ని వీడుతారు, మధ్య నెలకొన్న వివాదానికి కారణాలు ఏంటి అనే అంశాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: