యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధా కృష్ణతో నటించిన తాజా మూవీ రాధే శ్యామ్ ప్రభాస్ నటించిన `సాహో` మూవీ తరువాత వస్తున్న భారీ చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాని చాలా వరకు ప్రత్యేకంగా చూస్తున్నారు.ఇక ఇదిలా వుంటే ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని రోజులగా వస్తున్న పుకార్లకు కూడా చెక్ పెడుతూ మేకర్స్ రెండు రిలీజ్ డేట్ లని ప్రకటించబోతున్నారు. మార్చి నెలలో ఫస్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే కానీ లేదా ఏప్రిల్ నెలలో ఫస్ట్ ఫ్రైడే లేదా సెకండ్ ఫ్రైడే కానీ ఈ భారీ బడ్జెట్ సినిమాని రిలీజ్ చేయాలని రాధే శ్యామ్ మేకర్స్ పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారు.ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతోంది.ఇక ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్వరలోనే మరోసారి స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించాలని మేకర్స్ బావిస్తున్నారట. ఈమధ్య జనవరి 14 వ తేదీన ముందు అని ప్రకటించిన మేకర్స్ దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే.

ఇక దీనికి టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హోస్ట్గా వ్యవహరించి ఈ వెంట్ ని పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు.అయితే విడుదల వాయిదా పడటంతో మరోసారి ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో ప్రారంభించాలని అందుకు ముందుగా ఓ స్పెషల్ ఈ వెంట్ ని నిర్వహించాలని ఈ సినిమా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఇది ఎంత వరకు నిజమన్నది మాత్రం ఇంకా ఒక క్లారిటీ లేదు.సినీ వర్గాల్లో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది. మార్చి నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తే ఫిబ్రవరి నెలలో `రాధేశ్యామ్`సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాల్సి వుంటుంది. ఇక ఆ కారణంగానే ఈ సినిమా మేకర్స్ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని బాగా ఆలోచిస్తున్నారట. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు ఇంకా ట్రైలర్ యూ ట్యూబ్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: