తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందాడు కృష్ణవంశీ. సాలిడ్ సక్సెస్ను దక్కించుకొని ఎన్నో సంవత్సరాలు అవుతోంది. అయితే మునుపటి లాగా మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఆయన నుంచి ఒక అద్భుతమైన సినిమా వస్తోందని ఆయన అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే అభిమానులకు మాత్రం అవి ఎదురు చూపులు అయ్యేలా కనిపిస్తున్నాయి. కృష్ణవంశీ చివరగా విడుదల చేసిన సినిమా నక్షత్రం. ఈ సినిమా విడుదలై దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతోంది.

ఇప్పటివరకు తన తదుపరి సినిమాను విడుదల చేయలేదు. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా ను తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం దాదాపుగా 2 సంవత్సరాల పాటు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికైనా ఈ సినిమాను విడుదల చేయాలి కదా అంటూ నెటిజన్స్ తెలియజేస్తున్నారు. ఆ మధ్య కాలంలో ఈ సినిమా షూటింగులో పూర్తి చేసినట్లుగా చిత్ర బృందం స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు కానీ మళ్లీ షూటింగ్ చేస్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ముగిసింది అన్న తర్వాత మళ్లీ షూటింగ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..


సరే సినిమా గురించి కొన్ని వార్తలు వచ్చినప్పటికీ... ఒక వర్గం వారు మాత్రం కృష్ణ వంశీని అతిగా ఇష్టపడుతున్నారు. అందుకే వారు రంగమార్తాండ సినిమా కోసం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిస్తున్న ఉండడంతో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానం నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్రాజ్ కీలకమైన పాత్రలో నటించగా బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, యాంకర్ అనసూయ పలువురు నటీనటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. దాంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎక్కడ వార్తలు వినిపించలేదు ఇక ఈ చిత్రం మరింత ఆలస్యం అవుతూ ఉండడంతో ప్రేక్షకులను ఆసంతృప్తి చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: