మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితమే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . అదిరి పోయే అంచనాల మధ్య విడుదల అయిన ఆచార్య సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక పోయింది . దానితో చివరగా ఆచార్య సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది .

ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం  మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు .  కాక పోతే ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను మూవీ యూనిట్ దాదాపుగా కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది . ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 154 సినిమా కావడంతో ,  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది .  ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో ఈ మూవీ లో నటించబోతున్నాడు.

ఇప్పటికే రవితేజసినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మూవీ యూనిట్ చేసింది.  ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో రవితేజ 40 నిమిషాల నిడివి గల పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ కి జోడిగా ఈ మూవీ లో క్యాథరిన్ కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: