తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత ఏడాది ఎంతోమంది స్టార్ హీరోలు కూడా మరణించారు ఈ ఏడాది కూడా ఎంతోమంది సింగర్స్ నటీనటులు సైతం మరణించడం జరిగింది. ఇప్పుడు ఈ వార్తలు పరవకముందే తాజాగా సీనియర్ నటుడు నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూయడం జరిగింది.. గడిచిన కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యతో ఉంటున్న ఈయన చెన్నైలో తన స్వగృహంలో మరణించినట్లుగా తెలుస్తోంది.


ఈయన అసలు పేరు మాధురి కృష్ణ స్వస్థలం విశాఖపట్నం కృష్ణ పేరుతో తెలుగు చిత్ర సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు.. కానీ కాస్ట్యూమ్ కృష్ణ అంటే గుర్తుకు వచ్చేది మాత్రం ఒక్కరే అని చెప్పవచ్చు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన కాస్ట్యూమ్స్ కూడా అందించారు. అలాగే డ్రెస్ డిజైనింగ్ నుంచి కూడా కాస్ట్యూమ్స్ వరకు అన్ని ఈయనే చూసుకునేవారు.. అలా 1954 లో మద్రాస్ కి రావడం జరిగింది. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ సంస్థలు ఎక్కువ రోజులు పనిచేయడం జరిగింది ఆ సమయంలో సురేష్ కృష్ణ అని పిలిచేవారు ఆ తర్వాతనే పాస్టర్ కృష్ణగా పేరు సంపాదించారు.


కాస్ట్యూమ్స్ కృష్ణ నెరవేనుక ఆయన భారత్ బంద్ అనే నటుడుగా తెలుగు తెరకు మొదటిసారి పరిచయమయ్యారు.ఆ అవకాశం రావడం వెనక ఒక కథ ఉన్నది కృష్ణ ఇంటి పైన ఆఫీసులో దర్శకుడు కోడి రామకృష్ణ ఉండేవారు. ఆయన పిలిచి మూడు రోజులు వేషం వేయమని అడగడంతో అఇష్టంగానే ఈయన ఓకే చెప్పారట ఒకవేళ ఆ పాత్ర ఆయన చేయకపోతే ఆఫీసు కింద కోట శ్రీనివాసరావు గారితో పాటు మరొక నటుడు అక్కడికి పిలిపించారు.. ఆ తర్వాత పెళ్ళాం చెబితే వినాలి, అల్లరి మొగుడు ,దేవుళ్ళు, మా ఆయన బంగారం, పుట్టింటికి రా చెల్లి తదితర చిత్రాలలో నటించారు. నిర్మాతగా కూడా ఎన్నో కష్టాలను పడ్డారు ఈయన..

మరింత సమాచారం తెలుసుకోండి: