టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన హీరోయిన్ సమంత గత కొంతకాలం నుంచి మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఒకవైపు ఈ వ్యాధితో పోరాడుతూ చికిత్స తీసుకుంటూనే మరొకవైపు సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ మరింత క్రేజీ అందుకుంది. ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి కేవలం ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది సమంత. ఈ క్రమంలోనే తన ఆరోగ్యానికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.


కైరో తెరఫీ సెషన్కు హాజరైనట్లుగా తెలియజేసింది సమంత. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఇందులో ఈమె పొగలు కక్కి 150 డిగ్రీల ఫారెన్ హీట్ లో ఒక డబ్బా లో కూర్చుని ఉంది. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టం చాలా గట్టిపరిచేందుకే కాకుండా వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు ఈ తెరఫీని ఉపయోగిస్తారని రాసుకొచ్చింది సమంత. ఇన్ఫెక్షన్తో పోరాడే వైట్ బ్లడ్ సేల్స్ ని పెంచుతుంది. అంటూ బ్లడ్ ఫ్లో అయ్యేలా చేసి శరీరం మొత్తం హీలింగ్ కాన్ఫిడెన్స్ ని సరఫరా చేస్తుందని రాసుకొచ్చింది.

అలాగే సమంత క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సొంత షేర్ చేస్తూ ఉంటుంది. దీంతోపాటే తన హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తూ ఉంటుంది సమంత. సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అందుకోలేకపోయిన డీసెంట్ హిట్ టాక్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. త్వరలోనే సీటా డెల్ అనే వెబ్ సిరీస్ లో నటించబోతోంది. అలాగే బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ICE