రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాలను సైతం సృష్టించింది విడుదలైన మొదటి రోజే వందకోట్లకు పైగా క్రాస్ కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. దాదాపుగా ఈ సినిమా విడుదలై ఇప్పటికి 9 రోజులు పైనే కావస్తోంది దీంతో ఇటీవల ఈ సినిమా 660 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద 650 కోట్లకు పైగా రాబట్టిన చిత్రాలలో యానిమల్ సినిమా నాలుగవ స్థానంలో నిలిచింది.

ఇదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటే రాబోయే రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్స్ సైతం అందుకుంటుందని పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా జైలర్ లియో సినిమాను కూడా దాటేస్తే స్టేజ్ కి వెళ్ళిపోయిందని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు నటన కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కానీ కొంతమంది మాత్రం ఈ సినిమా కాస్త లెంతిగా ఉందంటూ మరి కొంతమంది ఫాదర్ సెంటిమెంట్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.


బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా ఉందని తెలుగులో 15 కోట్ల టార్గెట్ ను కేవలం అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా కొల్లగొట్టేసిందని తెలుస్తోంది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని ట్రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సినిమా ఓటిటి విషయానికి వస్తే ఓటీటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువబోతున్నట్లు సమాచారం మరి టోటల్గా ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: