సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఎఫైర్స్ కి కొదువే ఉండదు. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వారితోనే ప్రేమలో ఉంటే మరికొంతమంది ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వారితో రిలేషన్ లో ఉంటారు.అయితే అలాంటి విషయమే ఇప్పుడు మనం ఒకటి తెలుసుకుందాం.అదేంటంటే..విశ్వ నటుడు కమల్ హాసన్  భార్యకి క్రికెటర్ తో ఎఫైర్ ఉండేదట.అవును అప్పట్లో ఇది నిజమేనని ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చింది. మరి ఇంతకీ కమలహాసన్ భార్య అంటే సారిక నా లేక వాణి గణపత అని మీకు ఓ డౌట్ రావచ్చు.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కమల్ హాసన్ రెండో భార్య,శృతిహాసన్ ,అక్షరాహాసన్ తల్లి సారిక కమల్ హాసన్ కంటే ముందే ఇండియన్ స్టార్ క్రికెటర్ అయిన కపిల్ దేవ్ తో ప్రేమలో పడిందట. వీరిద్దరికి ఒక ఫంక్షన్ లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. అలా అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కొన్ని ప్రముఖ పత్రికలు రాసాయి.అలాగే దానికి అనుకూలంగానే కపిల్ దేవ్ ,సారికను పెళ్లి చేసుకోవాలని తన పేరెంట్స్ కి కూడా ఆమెను పరిచయం చేశారట.కానీ అప్పుడే ఓ అనుకోని ఘటన వీరిద్దరిని వేరు చేసింది.అసలు ఏం జరిగిందంటే.. కపిల్ దేవ్ జీవితంలో సారిక కంటే ముందే రోమీ అనే అమ్మాయి ఉంది.రోమి ని కపిల్ ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమలో పడ్డాడు.అయితే సారిక తో లవ్ ఎఫైర్ వార్తలు చక్కర్లు కొట్టాక కపిల్ కి రోమికి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారట. కానీ కపిల్ దేవ్ సారిక ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం తెలియడంతోనే రోమి పరిగెత్తుకుంటూ కపిల్ దేవ్ ఇంటికి వచ్చిందట. ఇక రోమిని అక్కడ చూసిన కపిల్ ఫస్ట్ లవ్ మర్చిపోలేక సారికకు బ్రేకప్ చెప్పి రోమీనే పెళ్లి చేసుకున్నాడట. అలా సారిక క్రికెటర్ కపిల్ దేవ్ ని పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది.కానీ వీరి మధ్య బంధం అర్ధాంతరంగా ముగిసిపోయింది.ఇక ఆ డిప్రెషన్ నుండి కమలహాసన్ తో బంధం కారణంగానే సారిక బయటపడిందట. అలా హీరోయిన్ సారిక కమల్ హాసన్ ని పెళ్లి చేసుకొని శృతిహాసన్, అక్షరా హాసన్ లకు జన్మనిచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: