మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె ఇటీవల ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.ప్రస్తుతం ఈమె నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్స్ స్థాపించి నిర్మాతగా వెబ్ సిరీస్ , సినిమాలను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించినటువంటి నిహారిక మొదటిసారి ఓ సినిమాకు నిర్మాతగా మారారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నిహారిక తెలియజేశారు. ఈ సినిమా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈమె వెల్లడించారు.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్నటువంటి ఈ సినిమాకు కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ పెట్టినట్టు నిహారిక వెల్లడించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అధికారికంగా వెల్లడించబోతున్నట్లు ఈమె తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా నిహారిక ఇండస్ట్రీకి ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో 11 మంది కొత్తవాళ్లు హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అలాగే నలుగురు హీరోయిన్లు కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని నిహారిక వెల్లడించారు. ఇలా కొత్త వారితో నిహారిక నిర్మాతగా ఓ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు అంటే ఇది నిజంగానే ఒక సాహసం అనే చెప్పాలి. ఇక నిహారిక కూడా తెలుగు సినిమాలతో పాటు మలయాళ సినిమాలను కూడా చేస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీ అయ్యారు. ఇప్పటివరకు వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే చేసింది ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథ తో ఒక సినిమా ని తెర మీదకు తీసుకు వస్తోంది. యూత్ ఫుల్ ఎక్కుతున్న ఈ సినిమాకి కమిటీ కుర్రాళ్ళు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

యాదవ్ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మొత్తం 11 మంది హీరోలు నలుగురు హీరోయిన్లు ఉంటున్నారు. అలానే వాట్ ది ఫిష్ పేరుతో దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి మళ్ళీ వస్తోంది నిహారిక. ఈ సినిమాకి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో అష్టలక్ష్మి అనే అమ్మాయిగా నిహారిక కనపడబోతోంది తెలుగుతో పాటుగా తమిళంలో కూడా ఒక సినిమా చేయడానికి నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక నిహారిక నటిస్తున్న మూవీస్ గురించి మాట్లాడుకుంటే విడాకుల తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక 'వాట్ ది ఫిష్' పేరుతో దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రయోగాత్మక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇందులో అష్టలక్ష్మి అనే అమ్మాయిగా నిహారిక కనిపించబోతుంది . తెలుగుతో పాటు తమిళంలో కూడా 'మద్రాస్కరన్' అనే మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి: