టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే చరణ్ కొంత కాలం క్రితం గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ తర్వాత చరణ్ , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు అని ఈ మధ్య కాలంలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తూ , సుకుమార్ తో ఓ మూవీ సెట్ చేసుకున్న చరణ్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ కలిగిన సందీప్ దర్శకత్వంలో మూవీ ఓకే చేశాడు అని వార్తలు రావడంతో చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.

కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ , సందీప్ కాంబోలో మూవీ ఓకే అయ్యింది అంటూ వస్తున్న వార్తలు అన్ని పూర్తిగా అవాస్తవం అని చరణ్ , సుకుమార్ సినిమా తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలి అనే దానిపై నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. మరి చరణ్ , సుకుమార్ సినిమా తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: