దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం రెండు భాగాలుగా విడుదలై ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ సినిమా మ‌ళ్లీ థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతుంది. రెండు పార్టులను క‌లిపి `బాహుబ‌లి ది ఎపిక్‌` టైటిల్ తో అక్టోబ‌ర్ 31న మేక‌ర్స్ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇందుకోసం ప్ర‌మోష‌న్స్ కూడా షురూ చేశారు. ఇదే త‌రుణంలో బాహుబ‌లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.


ఈ చిత్రంలో ప్రభాస్  హీరోగా టైటిల్ పాత్రను పోషిస్తే.. ఆయనకు ధీటుగా భల్లాల దేవా పాత్రలో రానా ద‌గ్గుబాటి చెలరేగిపోయాడు. ఈ ఇద్ద‌రు హీరోలు సినిమాకు మెయిన్ పిల్ల‌ర్స్ అయ్యారు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. భల్లాల దేవా పాత్ర కోసం రానాతో పాటుగా ఓ సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ త‌న‌యుడ్ని కూడా రాజ‌మౌళి సంప్ర‌దించార‌ట‌. ఇంత‌కీ అత‌ను మ‌రెవ‌రో కాదు నిహార్ కపూర్. జయసుధ కుమారుడీయ‌న‌.
నిహార్ కపూర్ హీరోగా ఓ రెండు సినిమాలు చేశాడు. అయితే వాటి క‌న్నా ముందు నిహార్ క‌పూర్ కు బాహుబ‌లిలో అవ‌కాశం వ‌చ్చింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేశాడు. బాహుబలిలో భల్లాల దేవా పాత్రకు మొద‌ట రానానే ఎంపిక చేశారు. కానీ స‌రిగ్గా షూటింగ్ ప్రారంభం అయ్యే నాటిని రానా డేట్స్ దొర‌క్క‌పోవ‌డంతో.. మంచి హైట్, బాడీ క‌లిగి ఉన్న నిహార్ క‌పూర్ ను మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. ఆయ‌న ఓకే చెప్ప‌డం.. సినిమా కోసం మూడు వారాల పాటు ట్రైనింగ్ తీసుకోవ‌డం కూడా జ‌రిగాయి.


కానీ లాస్ట్ మినిట్‌లో రానా రావ‌డంతో.. రాజ‌మౌళి అత‌నికే ఓటు వేశాడు. ఇక అప్పుడు నిహార్ క‌పూర్ కు కాలకేయ పాత్రను ఆఫ‌ర్ చేశార‌ట‌. ఆ పాత్ర‌కు సంబంధించి కొన్ని స్కెచెస్ కూడా చూపించార‌ట‌. కానీ నిహార్ క‌పూర్ ఈసారి నో చెప్పాడు. ఆ పాత్రకి ఫేస్ స‌రిగ్గా కనిపించదు. జయసుధ కూడా మొదటి సినిమాలో ఫేస్ కనిపించకుండా ఎందుకు వద్దు అన్నార‌ట‌. అందుకే బాహుబ‌లి మూవీని వ‌దులుకున్నాన‌ని తాజా ఇంట‌ర్వ్యూలో నిహార్ క‌పూర్ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: