టాలీవుడ్ లోకి మాలీవుడ్ హీరోయిన్లు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ సమంత తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అదృష్టం కలిసి వచ్చి టాప్ హీరోల సరసన నటించడంతో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస హిట్స్ తో దూసుకు పోతుంది. అయితే ఏం మాయ చేసావే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే పెళ్లయిన తర్వాత అక్కినేని వారి కోడలుగా ఉంటారని..సినిమాల్లో నటించదని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటికి రివర్స్ అయ్యింది..పెళ్లైన మూడు నెలల తర్వాత సమంత నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతూ వచ్చాయి. రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్ తో మంచి విజయాలు అందుకుంది. ఇటీవల శివ నిర్వాన దర్శకత్వంలో ‘మజిలీ’ సినిమాలో నటించారు భార్యభర్తలు నాగ చైతన్య, సమంత.
ఈ సినిమా మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెంచుతూ వచ్చింది. పెళ్లైన తర్వాత మొదటి సారిగా ఈ జంట నటిస్తున్న సినిమా..అందులోనూ వైవిధ్యభరిత కథనంతో తెరకెక్కింది. గతంలో సమంతకు అనుష్క, నయనతార మాదిరిగా ఒక సినిమాను ఒంటి చేత్తో నిలబెట్టే క్రేజ్ సంపాదించలేకపోయింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అక్కినేని వారి కోడలిగా మారిన తరవాత సమంత క్రేజ్ మరింత పెరిగింది.
ఇటీవల తమిళంలో ఆమె చేసిన 'సూపర్ డీలక్స్' ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సమంత పోషించిన వైవిధ్యభరితమైన పాత్ర ..ఆమెకి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ‘యూటర్న్’ సినిమాతో సోలోగా ప్రయత్నించింది. ‘మజిలీ’ సినిమాతో తన సత్తాను చాటుకుంది. తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అసలు ఆ పాత్రలో సమంత కాకుండా వేరే వాళ్లు చేస్తే చూడలేకపోయేవారమని అనేవాళ్లు కూడా ఉన్నారు. దాంతో సమంత క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఒక్కో సినిమాకి 3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే, ఆమె అడిగిన పారితోషికానికి జడిసి దిల్ రాజు వద్దనుకున్నారని సమాచారం. మొత్తానికి అక్కినేని వారి కోడలు తన పారితోషికం పెంచేసి నిర్మాతలకు షాక్ ఇస్తోందన్న మాట!