ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల నిన్న కన్నుమూశారు.  హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున ఆమె గుండెపోటు కారణంగా మరణించారనే వార్త విని తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారే ఉలిక్కిపడింది..శోకసంద్రంలో మునిగిపోయింది.  ఆమె మృతి పట్ల పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పార్థీవ దేహాన్ని తొలుత ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించారు. అక్కడ కాసేపు ఉంచి, మెయినాబాద్‌ మండలంలోని చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌‌కు తరలించారు.   


ఈ ఉదయం 11 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభించారు.  నానక్ రామ్ గూడ నుంచి ప్రత్యేక వాహనంలో ప్రారంభమైన విజయ నిర్మల అంతిమ యాత్రలో పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరులోని ఆమె ఫామ్ హౌస్‌లో విజయ నిర్మల అంత్యక్రియలు పూర్తి చేశారు.  


ఈ సందర్భంగా విజయ నిర్మలతో తమకున్న అనుబంధాన్ని పలువురు గుర్తుచేసుకున్నారు.  విజయ నిర్మల భౌతికకాయానికి హిందూ శాస్త్ర ప్రకారం కుమారుడు నరేష్ దహనసంస్కారాలు నిర్వహించారు. ఆమె అంత్యక్రియలు చూసి కృష్ణ బోరున విలపించారు..ఆయనను ఓదార్చడం ఎవరి వల్ల కాలేకపోయింది. పలువురు సినీ నటులతో పాటు విజయనిర్మల కుటుంబ సభ్యులు కూడా విజయనిర్మలను చివరినిమిషంలో చూసేందుకు వచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: