మొన్న ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ప్రజా సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని... ఆ బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు... ఏకంగా నల్ల రంగు చొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే కదా. ఆ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని చంద్రబాబు చెబుతూ ఉన్న సమయంలో అబ్జెక్షన్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేవగా... చంద్రబాబు తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు.
రక్తం మరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... తనలోని ఉగ్ర రూపాన్ని ప్రదర్శించి బీజేపీ నేతలపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా చంద్రబాబు వైఖరిపై స్పందించేందుకు తాజాగా మీడియా ముందుకు వచ్చిన జీవీఎల్.. చంద్రబాబును అసెంబ్లీ రౌడీగా అభివర్ణించారు. చంద్రబాబు పిచ్చి పీక్ స్టేజికి చేరుకుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జీవీఎల్... ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు అసెంబ్లీ రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నాడు చంద్రబాబు సభలో ఊగిపోయిన తీరును తనదైన శైలిలో ఎండగట్టిన జీవీఎల్... ఆయనను అసెంబ్లీ రౌడీతో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయింది.