చంద్ర బాబు మీద బీజేపీ నాయకులు ఎవరెన్ని విమర్శలు చేసినా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం విమర్షించడం లో ప్రత్యేక శైలి . నాలుగేళ్ల పాటు తమతో కలిసి ప్రయాణం చేసిన టీడీపీ నేతలు... అప్పుడు తమ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుని ఇప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నారంటూ తనదైన శైలి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. గతంలో తమతో టీడీపీ నేతలు ఎలా వ్యవహరించింది? ఇప్పుడు ఎలా వ్యవహరిస్తోంది?  పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తున్న జీవీఎల్... ఇప్పుడు సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచారని చెప్పాలి.
Image result for chandrababu naidu
మొన్న ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ప్రజా సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని... ఆ బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించిన చంద్రబాబు... ఏకంగా నల్ల రంగు చొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే కదా. ఆ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని చంద్రబాబు చెబుతూ ఉన్న సమయంలో అబ్జెక్షన్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లేవగా... చంద్రబాబు తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు.
Image result for gvl narasimha rao bjp
 రక్తం మరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... తనలోని ఉగ్ర రూపాన్ని ప్రదర్శించి బీజేపీ నేతలపై తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా చంద్రబాబు వైఖరిపై స్పందించేందుకు తాజాగా మీడియా ముందుకు వచ్చిన జీవీఎల్.. చంద్రబాబును అసెంబ్లీ రౌడీగా అభివర్ణించారు. చంద్రబాబు పిచ్చి పీక్ స్టేజికి చేరుకుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన జీవీఎల్... ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు అసెంబ్లీ రౌడీలా ప్రవర్తిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా నాడు చంద్రబాబు సభలో ఊగిపోయిన తీరును తనదైన శైలిలో ఎండగట్టిన జీవీఎల్... ఆయనను అసెంబ్లీ  రౌడీతో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: