ట్విట్టర్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు. మంత్రాలయం మఠానికి చెందిన 208 ఎకరాల భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని ఆయన అన్నారు.  దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలి అని ఆయన సూచించారు. ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలు లేదు అని ఆయన మండిపడ్డారు.

దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉంది అన్నారు. ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది అని ఆయన తెలిపారు. మే 25వ తేదీన టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ జి.వో.888ను ప్రభుత్వం విడుదల చేసింది అన్నారు. ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు,మఠాల ఆస్తులకు వర్తింపచేయాలి అని సూచించారు.

 ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయి అన్నారు. దాతలు ఇచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికిపెడితే మనోభావాలు దెబ్బతిన్న భక్తుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని హెచ్చరించారు. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: