అయితే కేవలం మనుషులకు మాత్రమే కాదు మనుషులకు కరోనా వైరస్ సోకిన తర్వాత వారికి సమీపం లో ఉండే పెంపుడు జంతువులకు కూడా కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది అని పలు సర్వేల్లో వెల్లడైన నేపథ్యం లో ప్రస్తుతం ఆయా దేశాలు మరింత అప్రమత్తంగా అవుతున్నాయి. కేవలం మనుషులకు శరవేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాదు ఇక పెంపుడు జంతువులకు కూడా కరోనా వ్యాధి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారూ అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో శునకాలు పిల్లలు వంటి పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. కరోనా వైరస్ బారిన పడిన మనుషులకు సమీపంలోగల జంతువులకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించే వాటికి ఈ వెసులుబాటు కల్పించారు. ఇటీవలే దేశంలోని జంజు నగరంలో తల్లీ కూతుళ్లకు కరోనా వైరస్ రాగా వారి పెంపుడు జంతువైన పిల్లికి కూడా కరోనా వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువులలో కరోనా కు సంబంధించి ఏ లక్షణాలు కనిపించినా ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి