వామ్మో ఇదేంది కొత్తగా.. నిన్న మొన్నటివరకు అందరికీ వస్తుందని చెప్పిన వైద్యులు..ఇప్పుడు బ్లడ్ గ్రూప్ ను బట్టి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఇది నిజంగానే చాలా మందికి అర్థం కాలేదు కదా .. ఇలా కూడా వైరస్ వ్యాపిస్తుందా? అనే సందేహాలు మొదలయ్యాయి.. అదేంటో.. ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా ఉంటుంది తదితర విషయాలను ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. 


నిజానికి ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది..రోగ నిరోధక శక్తి పై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ఇమ్యునిటి పవన్ ను పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాలని, మాంసం అధికంగా తినాలన్న సూచనలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజానికి మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. అంతేకాదు ‘ఓ’ గ్రూప్‌ రక్తం ఉన్నవారు కూడా కరోనా బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా పరిశోధనలో తేలింది..కోవిడ్‌–19 వ్యాధికి కారణమయ్యే సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ను ఢీకొట్టే ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్‌) ఎవరెవరిలో ఎక్కువగా ఉంటాయన్న దానిపై కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) పాన్‌–ఇండియా ఇటీవల సర్వే నిర్వహించింది.


ఈ పరిశోధనలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇకపోతే ఎబి,బి బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి సెరో పాజిటివిటీ అధికంగా ఉండటం వల్ల వారికి కరోనా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.అంతేకాకుండా సిగరెట్‌ తాగేవారి గొంతులో జిగురు పొర ఏర్పడుతుందని, ఇది వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు.. ఈ విషయాన్ని సైంటిస్టులు ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది.. ఏది ఏమైనా కరోనా నిబంధనలను పాటిస్తూ, స్వీయ జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: