పండగ రోజుల్లో ఏం జరిగిందో ఇప్పటికీ పోలీసులు తేల్చలేకపోతున్నారు.రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే గుడివాడ కథ పెద్దగా ముందుకు సాగడం లేదని కూడా తేలిపోయింది.దీంతో టీడీపీ తాజాగా కొన్ని ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చింది. ఛీర్ గాళ్స్ ను ఇక్కడికి తీసుకువచ్చారని,అందుకు తగ్గ వివరాలు ఆధారాలు తన వద్ద ఉన్నాయని,వీటిని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయాలని వేడుకుంటున్నారు.
గుడివాడ సందుల్లో ఏమయింది ఆ రోజు.సంక్రాంతి పండుగ రోజు వివాదాలకు అసలు కారణం ఏంటి? ఎక్కడి నుంచో అమ్మాయిలు ఇక్కడికే ఎందుకు వచ్చారు.ప్రశాంతమయిన వాతావరణంలో ఛీర్ గాళ్స్ చిందులెందుకు వేశారు? ఇవన్నీ ప్రశ్నలు..సమాధానం చెప్పాలని కోరుతున్నాయి టీడీపీ వర్గాలు.మరోవైపు తనకేమీ తెలియదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు.తాను అక్కడి కొందరు నృత్యాలు చేస్తుంటే ఆపాను తప్ప తనకు చెందిన కన్వెన్షన్ హాల్ లో టీడీపీ ఆరోపిస్తున్న విధంగా క్యాసినో కానీ క్యాబరే కానీ జరగనే లేదని మంత్రి చెబుతున్నారు.
మరోవైపు టీడీపీ లీడర్ వర్ల రామయ్య ఆరోపణలు మరో విధంగా ఉన్నాయి.పండగ రోజుల్లో గుడివాడకు ఛీర్ గాళ్స్ వచ్చారని, గన్నవరం నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి గోవా, గోవా నుంచి విజయవాడ మీదుగాఆ రోజు రాకపోకలు సాగించిన ఛీర్ గాళ్స్ వివరాలు వర్ల విలేకరులకు వివరించారు.ఆ రోజు మొత్తం 13 మంది అమ్మాయిలు ఇక్కడికి వచ్చారని,వీటి వివరాలు పోలీసులు సేకరిస్తే ఈ కేసును ఛేదించడం సులువు అవుతుందని వర్ల రామయ్య చెబుతున్నారు.