
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎస్మా ప్రయోగించటానికి ఉన్న అవకాశాల పై కసరత్తు చేస్తుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ మేరకు రెండు గంటలుగా కొనసాగుతోంది సమావేశం. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో పాటు గా భేటీ కొనసాగిస్తున్నారు మంత్రులు బుగ్గన, బొత్స, సలహాదారు సజ్జల. క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి బయలుదేరారు సీఎస్ సమీర్ శర్మ. జిల్లా కలెక్టర్లతో వర్చువల్ గా సమావేశం అవనున్న సీఎస్.. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సమీర్ శర్మ. అత్యవసర సేవల నిర్వహణా చట్టం 1971 ప్రకారం ఎస్మా ప్రయోగించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ స్టాఫ్, ప్రజా రవాణా, విద్యుత్, నీళ్ళ సప్లయ్, అంబులెన్స్ సర్వీసులు, మందుల తయారీ, రవాణా, ఆహార రంగం, బయో మెడికల్ వ్యార్ధాల నిర్వహణ వంటి సేవల అంశాల్లో ఎస్మా ప్రయోగించే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది.