ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం యాత్ర-2.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీవి రాఘవ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.. 2019లో విడుదలైన యాత్ర సినిమా ఎంత విజయాన్ని అందుకుందో అదే చిత్రానికి సీక్వెల్ గా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి.. తండ్రి కొడుకుల కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా నటించారు.. యాత్ర-2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాకుతో దూసుకుపోతోంది.


డీసెంట్ కలెక్షన్స్ తో రాబడుతున్న ఈ చిత్రం సుమారుగా మొదటి రోజు 6 నుంచి 8 కోట్ల క్రాస్ కలెక్షన్స్ వచ్చాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిత్రంలోని ఒక డిలీట్ సీన్స్ ను చిత్ర బృందం ఇటీవలే రిలీజ్ చేశారు.. ఇందులో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలను రిలీజ్ చేశారు మేకర్స్.. ముఖ్యంగా ఈ వీడియోలో జగన్ సీఎం చేసేందుకు ఎమ్మెల్యేలు ఎలా ప్రయత్నించడం అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు జగన్ పైన ఎలాంటి బురద సర్లే పనులు పడ్డారు అనే విషయాన్ని చేయండి ఇందులో చూపించారు.


ముఖ్యంగా చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ అద్భుతంగా నటించారు.. ముఖ్యంగా ఇందులోనే డైలాగులు కూడా హైలెట్గా నిలిచాయి తండ్రి పోయాడు అనుకుంటే కొడుకు వచ్చాడు.. తండ్రి చావే వాడికి రాజకీయ బలమైతే దానినే మనం బలహీనతగా మార్చాలి అంటూ.. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సీఎం అయ్యేందుకు సంతకాలు చేస్తున్నారు శవ రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం చేయండి.. జనాలకు  ఈ అబద్ధాన్ని నమ్మించడానికి మన పేపర్స్ ఉన్నాయి కదా వాటిని ఉపయోగించండి అనే చెప్పే డైలాగ్  ఆసక్తికరంగా ఉన్నాయి.. ముఖ్యంగా ఈ డైలాగులు అన్నీ కూడా పొలిటికల్ పరంగా హీట్ పెంచేలా ఉండడంతో డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి డిలీట్ సీన్స్ తో మరొకసారి హైప్ పెంచేస్తున్నారు చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: