
వీటితో పాటుగా పదివేల రూపాయలు పూచికిత అలాగే ఇద్దరు జమీన్ల హామీతో వైసిపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. గత నెల 10వ తేదీన టిడిపి కార్యకర్త కిరణ్ తో పాటుగా కొంతమంది పోలీసుల పైన దాడి చేసిన సంఘటనలు గోరంట్ల మాధవ్ పైన కేసు నమోదయ్యి పోలీసులు కూడా అరెస్టు చేశారు. దీంతో గోరంట్ల మాధవ్ తో పాటుగా రాజమండ్రి జైలు రిమాండ్ లో ఉన్న ఐదుగురు అనుచరులకు కూడా తాజాగా బెయిల్ మంజూరైనట్లు తెలుస్తోంది.
ఈనెల 23వ తేదీ 24వ తేదీన గోరంట్ల మాధవ్ ను కస్టడీలోకి తీసుకొని మరి విచారణ చేపట్టడం జరిగింది. ఇలా విచారణ అనంతరం ఇప్పుడు మళ్లీ బెయిల్ మీద బయటకు రావడంతో కొంతమేరకు గోరంట్ల మాధవ్ కు ఉరట కలిగించిందని చెప్పవచ్చు. ఇప్పటికే వైసీపీ పార్టీలో దూకుడుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకవైపు పార్టీ పరంగా యాక్టివ్ గా ఉంటూ మరొకవైపు తన దూకుడుని కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవలే వైసిపి పార్టీ ప్రమోషన్ కూడా కల్పించింది.