ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయాంలో కంటే తమ హయాంలోని పన్నులు, సిస్తూ ఇతర ఎగుమతి విషయాలలో దూకుడుగా ఉందంటూ కూటమి ప్రభుత్వం తాజా లెక్కలతో తెలియజేస్తుంది. అయితే వైసీపీ నేతలు కొన్ని మీడియా సంస్థలు కూడా కూటమి ప్రభుత్వంలో ఏపీ రాష్ట్ర ఆదాయం పెరగలేదని.. మాజీ సీఎం జగన్ హయాంలో వచ్చిన రాబడి ప్రస్తుతం రాలేదనే విధంగా చాలామంది తెలియజేస్తూ ఉన్నారట. అయితే కూటమి నేతలు మాత్రం గత ఆరు మాసాల నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం భారీగా పెరిగింది అంటూ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అందుకు సంబంధించి గణాంకాలతో సహా టిడిపి పార్టీ అనుకూల మీడియాలో కొన్ని లెక్కలేసి మరి చెబుతున్నారు.


అయితే ఇక్కడే అసలు సమస్య మొదలయ్యిందట. ఈ విషయంపై జగన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ తన ట్రాప్లో ఏపీ సర్కార్ చిక్కుకొనేలా చేస్తున్నారనే విధంగా కొంతమంది కూటమినేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం విషయంలో వెనుకబడిందని జగన్ ఉంటే ఆదాయాన్ని సంపాదించి మరి పథకాలను అమలు చేసే వారన్నట్లుగా తెలియజేస్తున్నారు.. ఈ విషయంలో  కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంటే సరిపోయేది కానీ ఇక్కడ సంపద పెరిగిందని జగన్ కంటే మరింత ఎక్కువే సంపాదించామని చెప్పడం వల్లే అసలు చిక్కు ఎదురైంది.


ఆ వెంటనే మరి సంపాదించినప్పుడు సూపర్ సిక్స్ ని ఎందుకు అమలు చేయలేదంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు ప్రజల వరకు వెళ్లిపోయింది. నిన్న మొన్నటి వరకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అసలు ఆదాయమే లేదని వ్యవస్థలను సరి చేసే పనిలో ఉన్నామంటూ తెలియజేశారు. అందుకే సూపర్ సిక్స్ ఆలస్యం అవుతుందని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఆ తదుపరి వారంలోనే వైసిపి చేసిన ట్రాప్లోకి కూటమి సర్కార్ ఇరుక్కుంది అన్నట్టుగా వినిపిస్తున్నాయి. అందుకే సీఎం చంద్రబాబు కూడా వెంటనే పథకాలను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: