
వైసీపీ అధిష్టానం ఆయనను నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా నియమించింది. హైదరాబాదులో ఉండే ఆదాల తరచూ నెల్లూరుకు వస్తున్న పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. నెల్లూరుకు వచ్చి శుభకార్యాలలో పాల్గొనటం .. అప్పుడప్పుడు అనుచరులతో సమావేశాలు పెట్టి వెళ్లిపోతున్నారు. జిల్లా నాయకత్వం ఆదాల ప్రభాకర్ రెడ్డిని కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదట. ఆదాలకు వైసీపీలో రోజురోజుకు ప్రాధాన్యత తగ్గుతుంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు కావటం ... ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో చాలా ప్రెస్మీట్లో జరిగాయి .. అందులో ఒక్క దానికి కూడా ఆదాల రాలేదు. ఆయన కార్యాలయ ప్రతినిధి గా ఉన్న రంగారెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం ఆయనను అసలు పట్టించుకోవడంలేదని తన అనుచరులకు జిల్లా ... రాష్ట్ర కమిటీ లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరినా అధినాయకత్వం ఆయన సూచనలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇక జగన్ కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఆదాల తన పని తాను చూసుకు పోతున్నారని అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు