
ముఖ్యంగా, రైతుల సమస్యలు, ప్రజల ఇబ్బందులు వంటి అంశాలను బయట ఎంత చెప్పినా అసెంబ్లీ వేదికలో చెప్పకపోతే ఉపయోగం ఉండదన్న అభిప్రాయం వైసీపీ లోపల పెరిగింది. దీని ఫలితంగానే జగన్, కొంతమంది కీలక ఎమ్మెల్యేలకి సభకు హాజరు కావాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొదటి విడతలో నలుగురు ఎమ్మెల్యేలునే అసెంబ్లీకి హాజరుకానున్నారు. వీరిలో పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఈ నలుగురూ ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశమైన వారే. పెద్దిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న ప్రచారం సాగింది. దాసరి సుధ జనసేన తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినా, ఆమె ఖండించారు.
మత్స్యలింగం ఇటీవల దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలనాగిరెడ్డి అయితే "గెలిచింది ఇంట్లో కూర్చునేందుకేనా?" అంటూ సోంత పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి కాంబినేషన్లో వారిని అసెంబ్లీకి పంపించడం వెనుక జగన్ వ్యూహం ఏమిటో అనే చర్చ మొదలైంది. మరోవైపు ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మరికొందరికి అనుమతి ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి దూరంగానే ఉండనున్నారు.ఇక మొత్తానికి చెప్పుకోవాల్సి వస్తే, అసెంబ్లీ బహిష్కరణపై వస్తున్న విమర్శలకు జగన్ కొంత వెనక్కి తగ్గడం స్పష్టమవుతోంది. అసెంబ్లీ వేదికలో సమస్యలు చెప్పకుండా బయటే గొడవపడితే ప్రజలు నమ్మరని వైసీపీ లోపలే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే వ్యూహంలో ఈ మార్పు. కానీ ఇది పార్టీ ఇమేజ్కి ఎంతవరకు ప్లస్ అవుతుందో, లేక మళ్లీ మైనస్ అవుతుందో చూడాలి.