
అయితే ఇవాళ ఆడికృత్తిగా చాలా మంది ఇళ్లలో దీపాలు పెట్టేసి ఉంటారు . అయితే దీపం పెట్టిన తర్వాత ఆ పిండి దీపాన్ని ఏం చేయాలి..? చాలా మంది ఆ పిండదీపాన్ని అలానే వదిలేస్తూ ఉంటారు . ఉదయం ఎంతో భక్తి శ్రద్ధలతో పిండి దీపాన్ని వెలిగించిన భక్తులు ఆ తర్వాత పిండి అలానే వదిలేసి రెండు రోజుల తర్వాత చెత్తకుప్పలో పడేస్తూ ఉంటారు . కానీ అది చాలా చాలా తప్పు . మహా పాపం దేవుడికి సంబంధించిన ఏ వస్తువులు కూడా చెత్త బట్టలో వేయకూడదు . సపరేట్ గా ఒక కవర్ లాంటిది పెట్టుకొని అందులో వేయాలి.
ఆ తర్వాత అది ప్రవహించే నీళ్లల్లో వేయడం మంచిది . లేకపోతే ఎక్కడైనా మట్టిని లోడి ఆ మట్టిలో దేవుడి పూజ కోసం వేసిన సామాగ్రిని అందులో పెట్టి ఉంచాలి అంటున్నారు పండితులు . మరీ ముఖ్యంగా ఆడి కృత్తిక రోజు పిండి దీపం పెట్టాక ఆ పిండి దీపాన్ని గోమాతలకు పెట్టడం మరింత మంచిది అంటున్నారు పండితులు . చాలామంది ఇది చేయరు కానీ ఇలా చేస్తేనే పూజ చేసిన ఫలితం దక్కుతుంది అంటున్నారు.