ప్రస్తుతం ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగి పోతున్న విషయం తెలిసిందే.  అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రస్తుతం విజయం కోసం తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న తరుణం లో చివరికి ప్లే ఆఫ్ కి ఏ జట్టు అర్హత సాధిస్తుంది అన్నది కూడా ప్రస్తుతం ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంది. ఇక ప్లే ఆఫ్  అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి మొన్నటి వరకు ఓటమి చవిచూసిన జట్టు వరుసగా మంచి విజయాలు సాధిస్తూ ఉండడం తో ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే.



 అయితే ఐపీఎల్ సీజన్ లో మొదటి నుంచి ముంబై ఇండియన్స్ జట్టు ఆధిపత్యం సాధిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.  పాయింట్ల పట్టికలో అగ్రస్థానం లో నిలుస్తోంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇప్పటి వరకు ఏకంగా 12 మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానం లో కి చేరుకుంది. అంతేకాదు మరో రికార్డు ను కూడా సృష్టించింది ముంబై ఇండియన్స్ జట్టు. ఏడాది ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ జట్టు రికార్డు సృష్టించింది.




 ఏకంగా 12 మ్యాచ్లు ఆడి 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో అగ్రస్థానం లో నిలవడమే  కాదు ప్లే ఆఫ్ కి అర్హత సాధించిన మొదటి జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకి ప్లే ఆప్ కి అర్హత సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక నాలుగవ స్థానం ఎవరు దక్కించుకో బోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్లే యాప్ కి ఎంపిక కావడానికి నాలుగో స్థానం కోసం ఎన్నో జట్లు పోటీపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: