ఇండియాలో క్రికెట్ అన్నది కేవలం ఒక ఆట మాత్రమే కాదు అది ఒక ప్రత్యేకమైన మతం అన్నట్లుగా మారిపోయింది. క్రికెట్ అనేది విదేశీ ఆట అయినప్పటికీ కూడా ఎక్కువమంది ప్రేక్షకులుగా క్రికెట్ను ఆస్వాదించడానికి ఆదరించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఇక టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా క్రికెట్ కి ఇండియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో అటు క్రికెటర్లకు ఫాలోయింగ్ కూడ అదే రేంజ్ లో ఉంటుంది.


 ఈ క్రమంలోనే అటు క్రికెటర్లకు సంబంధించిన వార్త ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా గురించి ఇలాంటి వార్త హాట్ టాపిక్ గా మారింది. టీమిండియాలో స్టార్ ఆల్రౌండర్ కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా తన దూకుడైన ఆటతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇటీవలే అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టాడు అనే విషయం తెలిసిందే. ఇక హార్దిక్ పాండ్యా ఎక్కడ మ్యాచ్ ఆడిన అతని సతీమణి నటాషా స్టాండ్స్ నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది.


 దీంతో ఆమెకు కూడా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పాలి. హార్థిక్ పాండ్యా సతీమణి నటాషా గురించి ఇటీవలే ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. సాధారణంగా హార్దిక్ పాండ్యాకు  మొదటి క్రష్ దీపికాపదుకొనె నట. అంతేకాదు ఇక హార్దిక్ పాండ్యా భార్య నటాషాది సెర్బియా విషయం కూడా బయటకు వచ్చింది. అంతే కాకుండా సత్యాగ్రహ అనే మూవీ లో ఐటం సాంగ్ లో చేసిందట నాటషా. ఆ తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ లో కూడా నటించిందట   కామన్ ఫ్రెండ్ ద్వారా హార్దిక్ పాండ్యా కు పరిచయమైన నటాషా మొదటి చూపులోనే హార్దిక్ పాండ్య ని బుట్టలో వేసుకుందట. ఇటీవలే ఈ విషయాన్ని ఒక వెబ్సైట్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: