ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఏకంగా కఠిన పరిస్థితుల మధ్య పరుగులు రాబట్టి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ తన అనుభవంతో మ్యాచ్ ఇక టీమిండియా వైపు లాగేసాడు అని చెప్పాలి. అయితే ఇలా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా ఇక తర్వాత మ్యాచ్ నెదర్లాండ్స్ తో ఆడబోతుంది. నేడు మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.


 అయితే ఈ మ్యాచ్ కి వర్షపు ముప్పు పొంచి ఉంది అని అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఇక నెదర్లాండ్స్ తో మ్యాచ్లో మళ్లీ అందరి దృష్టి కూడా విరాట్ కోహ్లీ పైనే ఉంది అని చెప్పాలి. భారత్ తో మ్యాచ్ కి ముందు నెదర్లాండ్స్ కెప్టెన్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ ను మీరు ఎలా అడ్డుకోబోతున్నారు అంటూ ప్రశ్నించగా షాకింగ్ సమాధానం చెప్పాడు. మాతో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ మాపై కరుణ చూపిస్తాడని భావిస్తున్న అంటూ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ పై విధ్వంసకర ఇన్నింగ్స్ తో చెలరేగిన  కోహ్లీ.. అదే బ్యాటింగ్ మాతో రిపీట్ చేయడేమో అని అనుకుంటున్నా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు.


 వరల్డ్ కప్ లో సూపర్ 12 లో ఆడటం అదృష్టంగా భావిస్తున్నాం. ఒక పెద్ద జట్టుతో మ్యాచ్ ఆడుతున్నాం అంటే ఒత్తిడి ఉండడం ఎంతో సహజం. కానీ అది ఉండేది చాలా తక్కువ. మాకు అవకాశాలు చాలా తక్కువ. వచ్చిన వాటిని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేము. టీమిండియా ముందు మేము నిలబడలేమని తెలుసు. కానీ గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పు లేదుగా. ఇక వరల్డ్ కప్ లాంటి బిగ్ టోర్నీలో టీమిండియా లాంటి అగ్రజట్టుతో మ్యాచ్ ఆడటం ఒక ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తాం అంటూ నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్ వర్డ్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: