ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి కూడా కీలకమైన మ్యాచ్ కావడంతో ఇక హోరాహోరీపోరు కొనసాగించారు. ఒక జట్టు మరో చెట్టుపై ఆధిపత్యం కొనసాగించడం కాదు.. నువ్వా నేనా అన్నట్లుగానే ఈ మ్యాచ్ సాగింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇక బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడం ఖాయం అన్న విధంగానే బంగ్లా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవడంతో ఇక అప్పటికే టీమ్ ఇండియాతో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ ఎక్కువ పరుగులు చేసి ఉంది. దీంతో డక్ వర్త్ లూయిస్ లో విజయాన్ని నిర్ణయిస్తే మాత్రం బంగ్లాదేశ్ కే విజయం ఖాయమని అందరూ భావించారు.


 కానీ అదృష్టవశాత్తు అటు వరుణుడు కరుణించడంతో.. ఇక మ్యాచ్ తర్వాత కొనసాగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత బౌలర్లు చెలరేగి  వరుసగా వికెట్లు తీయడంతో ఇక బంగ్లాదేశ్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ.. ఇక భారత్ చేతిలో ఓటమి చవిచూసింది అని చెప్పాలి. అయితే భారత్ తో మ్యాచ్ ముందు అటు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీ బుల్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి వస్తే తాము మాత్రం ఇండియనూ ఓడించడానికి వచ్చాం అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఇటీవల ఓటమి తర్వాత మాట్లాడుతూ.. భారత్తో ఎప్పుడు ఇదే జరుగుతుంది. దాదాపు గెలిచినంత పని చేస్తాం.. కానీ గెలవం. మ్యాచ్ గొప్పగా సాగింది. ప్రేక్షకులతో పాటు రెండు జట్లు కూడా ఆటగాళ్ళు ఆస్వాదించారు. చివరికి ఎవరో ఒకరు గెలవాలికదా అంటూ షకీబ్ ఉల్ హసన్ వ్యాఖ్యానించాడు. ఇక తమ జట్టు బ్యాట్స్మెన్ లిటెన్ దాస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ ప్రశంసలు కురిపించాడు బంగ్లాదేశ్ కెప్టెన్. ఇక అతని స్పోర్టివ్ నెస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: