ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లతో పాటు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉండటం చాలా సహజం. అయితే అందులో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడుతున్నారా.. అయితే ఈహెచ్చరిక మీ కోసమే.. వెంటనే మీరు మీ OS ను అప్ డేట్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూకరిటీ ఏజెన్సీ..కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ విండోస్ OS లో లోపాలను గుర్తించినట్లు తెలిపింది. వీటి సాయంతో హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ఓఎస్ సెక్కూరిటీ సిస్టమ్ విండోస్ డిఫెండర్ పనిచేయకుండా చేసి సైబర్ దాడికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. యూజర్ కు సంబంధించిన సమాచారం సులువుగా సైబర్ నేరగాళ్లకు చేరడంతో యూజర్ ప్రమేయం లేకుండా కంప్యూటర్ ను తమ అధీనంలోకి తీసుకోగలరని తెలిపింది. విండోస్ డిఫెండర్ లోని క్రెడెన్షియల్ గార్డ్ లోని బగ్ కారణంగా ఈసమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈబగ్ వల్ల 43 మైక్రోసాఫ్ట్ వెర్షన్లలో సమస్య తలెత్తినట్లు సైబర్ సెక్యూరిటీ కంపెనీలు వెల్లడించాయి.


ప్రపంచ వ్యాప్తంగా కూడా సుమారు 1.5 బిలియన్‌ యూజర్లు విండోస్‌ ఓఎస్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఈక్రమంలో భారత్‌లోని విండోస్‌ యూజర్లు వెంటనే తమOSను అప్‌డేట్ చేసుకోవాలని (CERT-IN) తమ నివేదికలో పేర్కొంది. ఓఎస్‌ అప్‌డేట్ కోసం స్టార్ట్‌ మెనూపై క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్‌లోకి వెళితే విండోస్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చివరిగా మీ ఓఎస్‌ ఎప్పుడు అప్‌డేట్ అయిందనేది తెలుస్తుంది. మీ కంప్యూటర్‌ ఆటో అప్‌డేట్‌ ఫీచర్‌ ఎనేబుల్ చేసుకుంటే మీ విండోస్‌ ఓఎస్‌ ఆటోమేటిగ్గా అప్‌డేట్ అవుతుంది. అలానే క్రెడెన్షియల్‌ గార్డ్‌ బగ్‌ కారణంగా ప్రభావితమైన విండోస్‌ ఓఎస్‌ వెర్షన్‌ల జాబితాను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. వీటిలో విండోస్‌ 11, విండోస్‌ 10, విండోస్‌ సర్వర్‌ 2022, 2019, 2016లు ఉన్నాయి. ఈ లింక్ ను క్లిక్ చేసి నేరుగా CERT-IN వెబ్ సైట్ లోకి వెళ్లి ఓఎస్ కు సంబంధించిన వివరాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: