కావలసిన పదార్థాలు: మటన్: 1/2 కేజి ఉడికించిన బంగాళదుంప: 1  ఉప్పు: రుచికి తగినంత కారం: 2 టీస్పూన్   గరం మసాలా: 1 టీస్పూన్ నూనె: తగినంత  కొత్తిమీర: 2  స్పూను పెరుగు: 1/2  కప్ గ్రేవీకోసం కావల్సిన పదార్థాలు: కొబ్బరిపొడి: 2tsp వేయించిన పల్లీలు: 20 గ్రాములు గరంమసాలా: 1 టీస్పూను నువ్వులు: 2 టీస్పూను        ఉడికించిన బంగాళదంపల ముక్కలు : 10 తయారు చేయు విధానం: 1. ముందుగా గ్రేవీకోసం సిద్దం చేసుకొన్నపదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. 2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తరవాత అందులో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. 3. కొద్దిసేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి మరోసారి కలపాలి. 3. తరువాత మటన్ వేసి అది మెత్తగా మగ్గిన తరువాత చిదిమిన బంగాళదుంప, పెరుగు, గరం మసాలా, ఉప్పు, తగినంత నీరు పోసి బాగా ఉడకనివ్వాలి. 4. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మటన్ కుర్మా రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: