అయితే గర్భిణులు అరటిపండ్లు తినకూడదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కడుపులో ఉండే బిడ్డకు దగ్గు, జలుబు వంటి వ్యాధులు వస్తాయి. అలాగే చేపలను తినడానికి కూడా పెద్దలు నిరాకరిస్తారు. చేపలు తినడం వల్ల బిడ్డ శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అందుకే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తినాలని, గర్భిణీగా ఉన్న సమయంలో తల్లి తినే ఆహారం బిడ్డకు వెళ్తుంది. బిడ్డ ఆరోగ్యానికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు.
గర్భిణులు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. తొందరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకునే అలవాటు చేసుకోవాలి. ఆహారంలో తప్పనిసరిగా విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. డెలివరీ చివరి మూడు నెలల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్కు సంబంధించిన టాబ్లెట్లను వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ సమయంలో గర్భిణుల రక్తం చాలా వరకు క్షీణిస్తుంది. ఆ సమయంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటుందని, అందుకే ఈ టాబ్లెట్లు వేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.