తొలి సినిమా 1968 లో విడుదలైన తమిళ సినిమా "జీవనాంశమ్". 1970వ దశకంలో తారగా వెలుగొందిన లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలో నటించింది. ఈమె నటించిన మలయాళంలో విజయవంతమైన చట్టకారి (1974) చిత్రాన్ని హిందీలో జూలీ (1975) అనే పేరుతో, తెలుగులో "మిస్ జూలీ ప్రేమకథ" (1975) గా పునర్నిర్మించి విడుదల చేశారు. జూలీ చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు బెంగాళీ సినీ పాత్రికేయ సంఘం యొక్క "సంవత్సరపు ఉత్కృష్ట నటన" పురస్కారాన్ని అందుకున్నది. జూలీ చిత్రం యొక్క విజయం తర్వాత లక్ష్మి మరే హిందీ చిత్రంలోనూ నటించక దక్షిణాది భాషల సినిమాలపైనే దృష్టిపెట్టింది. 1977లో విడుదలైన తమిళ సినిమా శిలా నేరంగలిల్ శిలా మణితారగళ్ లో నటనకు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని అందుకొని ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకొన్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయ్యింది.
1980లలో కథానాయకి పాత్రలు కరువైన తరుణంలో తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలలో సహాయనటిగా చేయటం ప్రారంభించింది. జీన్స్ (1998) చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బామ్మ గానూ, హల్చల్ (2004) లో కరీనా కపూర్ బామ్మగానూ నటించింది. 400కు పైగా సినిమాలు చేసిన లక్ష్మి, రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది. ఈవిడ మూడుసార్లు వివాహము చేసుకున్నది. పదిహేడేళ్ళపుడు పెద్దలు కుదిర్చిన సంబంధము ద్వారా భాస్కర్ ను వివాహం చేసుకుంది. ఇతను ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేసేవాడు. ఇతని ద్వారా 1971 లో కుమార్తె ఐశ్వర్య జన్మించింది. తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత తన సహనటుడు మోహన్ ను పెళ్ళి చేసుకుంది. వీరిద్దరూ కూడా త్వరలోనే విడిపోయారు. తర్వాత నటుడు, దర్శకుడు అయిన శివచంద్రన్ ని పెళ్ళాడింది. కన్నడ నటుడు అనంత్ నాగ్ తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి