కరోనా బ్రేక్ తర్వాత మొదలైన తెలుగు చిత్రాలు అంత వేగవంతంగా అయితే పూర్తి కావట్లేదు.. ఎదో ఆఖరి దశలో ఉన్న సినిమాలు అయితే పూర్తి అయ్యాయి కానీ డెబ్భై శాతం అయినా సినిమాలు నల్లేరు మీద నడకలా సాగిపోతున్నాయి.. ఈ సంక్రాంతి కి రిలీజ్ అవుతాయన్న ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు ఆ సమయానికి రిలీజ్ కానట్లుగానే కనిపిస్తున్నాయి.. చిరంజీవి ఆచార్య సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది.. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మొదట్లో వార్తలు వచ్చినా ఇప్పుడు షూటింగ్ లేట్ అవుతున్న కొద్దీ ఆ టైం రిలీజ్ కి అంచనాలు పెటుకోవద్దనేది తాజా సమాచారం..