బీజేపీ పార్టీ గ్రేటర్ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఆ పార్టీ గెలవడానికి అవలంభించే విధానాలను బట్టి తెలుస్తుంది.. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ కి ప్రజలనుంచి మద్దతు లభిస్తుంది.. ఈ మద్దతు ను తమకు అవకాశం గా మలుచుకుని గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల దళం, ప్రచారంలోకి పార్టీ అగ్రనేతలను దింపుతోంది. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి చరిష్మా ఉన్న నాయకులను అస్త్రాలుగా సంధించింది.