తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, నిజామాబాద్ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత మరో సారి వివాదంలో నిలిచారు.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆమె తన ఓటుహక్కుని వినియోగించుకున్న కారణంగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కినట్లు అయ్యింది.. గతంలో కూడా కవిత ఎన్నో సార్లు వివాదంలోకి లాగబడ్డారు. ఎమ్మెల్సీ అయిన తరువాత ఎక్కడ ఆమెకు మంత్రి పదవి ఇస్తారో అని ప్రతిపక్షాలు నానాహంగామా చేశాయి.. నేరుగా కేసీఆర్ ని ఎదురించే ధైర్యం లేక కవిత పై విమర్శలు చేయడం నచ్చడం లేదని తెరాస నేతలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేశారు..