మంత్రి హరీశ్ రావు ఓ వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో విధుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చూపిన ఓ డ్యూటీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళకు ప్రసవం చేయడానికి ఓ డ్యూటీ డాక్టర్ నిరాకరించారు. ఈ ఘటన మంత్రి హరీశ్‌ రావు దృష్టికి వచ్చింది. ఆ డ్యూటీ డ్యూటీ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు.. తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌తో ప్రసవానికి వచ్చిన మహిళకు ప్రభుత్వాసుపత్రిలో ఖచ్చితంగా ప్రసవం చేయాలని వైద్యులను మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. కొవిడ్ కష్ట సమయంలో పేద ప్రజలకు వైద్యం చేయాల్సిన వైద్యులు ఇలా నిర్లక్ష్యం వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి: