భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు   కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఇక కల కాలం పాటు ఒకరికి ఒకరు తోడుగా కలిసి ఉంటారు. కష్టసుఖాలు వచ్చినప్పుడల్లా నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తలు  బద్ద  శత్రువులు కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు.. సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరగడం సర్వసాధారణం. ఇలా ఇటీవలి కాలంలో భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదాలు ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు  తీసుకునేంత వరకు దారి తీస్తున్నాయి అని చెప్పాలి. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు  పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలోని దారుణ ఘటన చోటుచేసుకుంది.  దంపతుల మధ్య ఏర్పడిన వివాదం భార్య ప్రాణం పోవడానికి కారణమైంది. ఏకంగా కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ఏ సమస్య రాకుండా చూసుకుంటాను అంటూ ప్రమాణం చేసిన భర్త కోపంతో ఊగిపోయి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇక ఆ తర్వాత భార్య లేని జీవితం వద్దు అనుకుని తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్, పంప సర్కారు దంపతులు..  జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి పంజాగుట్ట పరిధిలోని ప్రేమ్ నగర్ లో ఉంటున్నారు.



 అయితే గత కొంత కాలం నుంచి వీరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే నీళ్ళ తొట్టి లో భార్యను ముంచి దారుణంగా హతమార్చాడు. అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి సూసైడ్  చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే  క్రమంలో అతని జేబులో ఉన్న చిన్న డైరీలో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు రాశాడు. ఇక రైల్వే పోలీసులు సమాచారంతో పంజాగుట్ట పోలీసులు అతని నివాసానికి వెళ్లి అక్కడ భార్య మృతదేహాన్ని  స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: