తల్లి కొడుకుల బంధం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇక మాతృత్వపు ప్రేమను దేంతో కూడా వెలకట్టలేము అన్న విషయం తెలిసిందే. అయితే ఓ తల్లి కడుపున పుట్టిన కొడుకు.. బయట ఉండే మహిళలను మరో కోణంలో చూస్తాడేమో కానీ తన తల్లిని మాత్రం దేవతల పవిత్రంగానే చూస్తూ ఉంటాడు. అంతలా తల్లి కొడుకుల బంధం పవిత్రంగా ఉంటుంది  కానీ ఇక్కడ మాత్రం ఈ బంధానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారు తండ్రి కొడుకులు.


 ఏకంగా కడుపున పుట్టిన కొడుకు వీర్యంతోనే ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఫ్రీజ్ చేసిన తన కొడుకు వీర్యాన్ని  ఉపయోగించి సరోగసి ద్వారా అతని తల్లి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ఏకంగా ప్రతి ఒక్కరిని నివ్వరపోయేలా చేసింది   స్పెయిన్ లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు నటిగా ప్రేక్షకులను అలరించిన అనా బ్రెగన్ వయస్సు ప్రస్తుతం 69 ఏళ్ళు. అయితే గతంలో ఆమెకు అలెస్ లేక్రియ అనే కొడుకు ఉండేవాడు. అతను 27 ఏళ్ల వయసులో మరణించాడు. అయితే మరణానికి ముందు అలెస్ కు తండ్రి కావాలని కోరిక బలంగా ఉండేదట. దీంతో తన వీర్యాన్ని నిలువ చేసి పెట్టాడు.


 ఇక ఆ వీర్యాన్ని ఒక ప్రింటర్లో భద్రపరిచిన తర్వాత అతడు క్యాన్సర్ బారినపడి కొన్నాళ్ళకి ప్రాణాలు కోల్పోయాడు. ఇక కొడుకుకి తండ్రి కావాలని కోరిక బలంగా ఉండేది అనే విషయాన్ని తెలుసుకున్న అతని తల్లి.. ఇక అతని వీర్యాన్ని  భద్రపరిచిన విషయాన్ని ఇంట్లో లభించిన ఒక రసీదు ఆధారంగా తెలుసుకోగలిగింది. దీంతో తన కొడుకు కల నెరవేర్చాలి అనుకుంది ఆ తల్లి. 69 ఏళ్ల వయసులో ప్రాణాలను పణంగా పెట్టింది  భద్రపరిచిన కొడుకు వీర్యంతో సరోగసి ద్వారా తల్లి కావాలని అనుకుంది. వైద్యులను సంప్రదించగా ఆమె శరీరం సరోగసికి సహకరిస్తుందని వైద్యులు గుర్తించారు. ఇక కొన్ని కండిషన్లో మేరకు సరోగసి కి అంగీకరించారు. ఇలా ఈ పద్ధతి ద్వారా కొడుకు వీర్యాన్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టగా.. ఇక ఇటీవల ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: