ఇజ్రాయిల్ లో అక్టోబర్ 7 న నరమేధం తో ఆ దేశానికి అండగా ఉంటామని భారత్ మద్దతు తెలిపింది. ఉగ్ర వాదం ఎక్కడ ఉన్నా అది తీవ్ర సమస్యగానే పరిణమిస్తుందని వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇజ్రాయిల్ పై గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు, లెబనాన్ నుంచి హిబ్జుల్లా, వెస్ట్ బ్యాంకు, యెమెన్ నుంచి టెర్రరిస్టులు ఏక కాలంలో ముప్పేట దాడులు చేసి ఇజ్రాయిల్ లో మారణ హోమానికి తెగ బడ్డారు.


దీన్ని ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. చిన్న పిల్లలను కూడా చూడకుండా నరమేధం చేసిన హమాస్ ఉగ్రవాదులను పురుగుల్లా నలిపేస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. అయితే ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గాజాలో భీకర దాడులు చేసిన ఇజ్రాయిల్ హమాస్ కు గట్టి సందేశం పంపింది.


హమాస్ ను ఈ భూమిపై లేకుండా తుద ముట్టిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని ప్రకటించారు. అయితే నవంబర్ 26,  2011 దాడుల్లో ముంబయి వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడుల సమయంలో కూడా ఇజ్రాయిల్ భారత్ కు అండగా ఉంటామని ప్రకటించింది. ప్రస్తుతం నవంబర్ 26న భారత్ కు సందేశం పంపింది. మీరు 12 ఏళ్ల క్రితమే ఇలాంటి దాడులు చూశారు. మేం ఇప్పుడు చూశాం. ఏ దేశానికైనా ఉగ్రవాదుల ముప్పు ఉండటం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.


భారత్ కు అన్ని రకాల అండగా ఉంటామని ప్రకటించింది. ముఖ్యంగా టెర్రరిస్టులను ఏరి వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. ముంబయి దాడుల తర్వాత భారత్ స్పందించిన తీరు, అజ్మల్ కసబ్ ను పట్టుకుని ఉరి కంభం ఎక్కించడం తదితర పరిణామాలు శర వేగంగా జరిగిపోయాయి. అయినా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల నుంచి కశ్మీర్ లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో కచ్చితంగా ఉగ్ర మూలాలను కూకటి వేళ్లలో పెకిలించేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: