ముఖ్య సంఘటనలు
1709: మీడింగు పంహెబా మణిపూర్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
2017: ఆగష్టు 28 న భారత సుప్రీం కోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. (చిత్రంలో)
జననాలు
1749: గేథే, జర్మనీ రచయిత. (మ.1832)
1904: దాట్ల సత్యనారాయణ రాజు, స్వతంత్ర సమరయోధుడు, భారత పార్లమెంట్ సభ్యుడు.
1928: విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు. (మ. 2004)
1934: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.ఆర్కాట్ పార్థసారథి కోమల (జ. 1934 ఆగష్టు 28) దక్షిణభారతదేశపు నేపథ్యగాయని. ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, మళయాలం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.
1949: డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి.డబ్బింగ్ జానకి దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది.
1959: సుమన్, తెలుగు సినిమా నటుడు.
1967: ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు
1969 : ఒక అమెరికన్ సాంకేతిక అధికారి, ఉద్యమకర్త, రచయిత షెరిల్ శాండ్బర్గ్
1993 : బ్రిటిష్ పాప్ గాయని చెర్ల లాయిడ్
మరణాలు
1958: భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897)
1988: చీకటి పరశురామనాయుడు, రాజకీయ నాయకుడు. (జ.1910)
2006: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
2015: బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి